- Home
- tollywood
కీర్తి సురేశ్ తాజా చిత్రంగా 'గుడ్ లక్ సఖి'
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గుడ్ లక్ సఖి' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత ప్రాజెక్టులుగా ఆమె చేతిలో 'సర్కారువారి పాట' .. 'భోళా శంకర్' సినిమాలు ఉన్నాయి.
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రీకరణ పరంగా చివరిదశకి చేరుకుంది. ఇక చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ రూపొందిస్తున్న 'భోళా శంకర్' ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆమె వంశీ పైడిపల్లి సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.