113 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

Admin 2020-10-20 18:48:13 entertainmen
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత దూకుడు పెంచాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల మేర లాభపడింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో... చివరకు సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో 40,544 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 11,897 వద్ద స్థిరపడింది.