తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు విరాళంగా : ఎన్టీఆర్

Admin 2020-10-20 15:36:13 entertainmen
భారీ వర్షాలు, వరదలకు ఎన్నో కుటుంబాలు ప్రభావితమయ్యాయని టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన హైదరాబాదు నగర పునరుద్ధరణ కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు.

దర్శకుడు అనిల్ రావిపూడి కూడా హైదరాబాద్ నగర వాసుల కష్టాలకు స్పందించారు. సహాయ చర్యల కోసం రూ.5 లక్షలు విరాళంగా అందిస్తున్నట్టు ట్విట్టర్ లో వెల్లడించారు.