తొలిరోజు రూ.4 కోట్లకు పైగా కలెక్షన్లు

Admin 2020-12-27 22:34:10 entertainmen
మెగా హీరో సాయితేజ్, నభా నటేశ్ ప్రధానపాత్రల్లో నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన 'సోలో బ్రతుకే సో బెటర్' క్రిస్మస్ రోజున థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఓపెనింగ్స్ అదిరిపోవడంతో, తొలిరోజే రూ.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండోరోజు కూడా అదే దూకుడు కనబరిచింది. రెండో రోజున ఈ చిత్రం రూ.3.29 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల షేర్ రూ.4.8 కోట్లు సాధించింది. మొత్తమ్మీద సాయితేజ్ కొత్త చిత్రం రెండ్రోజుల్లో రూ.7.99 కోట్ల గ్రాస్ తో నిర్మాతలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. అది కూడా 50 శాతం ప్రేక్షకులతోనే ఈ ఘనత సాధించడం విశేషం అని చెప్పాలి.