- Home
- bollywood
'త్రిభంగ'తో కాజోల్ డిజిటల్ రంగ ప్రవేశం
తారలంతా ఓపక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క ఓటీటీ వైపు కూడా తమ దృష్టి పెడుతున్న విషయం మనకు తెలిసిందే. భవిష్యత్తు ఎక్కువగా డిజిటల్ ప్లాట్ ఫామ్ రాజ్యమేలుతుందన్న అంచనాల నేపథ్యంలో ఒక్కొక్కరే అటువైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఓటీటీ సంస్థల కోసం వెబ్ సీరీస్, టాక్ షోస్ చేస్తుంటే, మరికొందరు ప్రత్యేకంగా సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ కూడా డిజిటల్ రంగ ప్రవేశం చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన 'త్రిభంగ' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని ఆమె భర్త అజయ్ దేవగణ్ నిర్మించడం ఒక విశేషమైతే.. ప్రముఖ నటి రేణుకా సహానీ దీనికి దర్శకత్వం వహించడం మరో విశేషం.