సంక్రాంతికి భారీ స్థాయి రిలీజ్ : సర్కారువారి పాట

Admin 2021-06-20 20:47:12 entertainmen
మహేశ్ బాబు కథానాయకుడిగా ' సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని, రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటూ ఉండగా, కరోనా తీవ్రరూపం ధరించింది. దాంతో షూటింగును ఆపేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లలేదు ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, జులై మొదటివారంలో మళ్లీ షూటింగునుకి మొదలుపెట్టే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ వచ్చేనెల చివరి వరకూ నాన్ స్టాప్ గా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. మహేశ్ బాబుతో పాటు ముఖ్య పాత్రధారులంతా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నారని చెబుతున్నారు.