సాయితేజ్ - అపోలో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స

Admin 2021-09-12 12:53:07 ENT
స్పోర్ట్స్ బైకు నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన హీరో సాయితేజ్ కు ప్రస్తుతం హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 5 గంటల సమయంలో అపోలో ఆసుపత్రి వైద్యులు సాయితేజ్ ఆరోగ్యపరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. సాయితేజ్ కు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. కీలక అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని, అంతర్గత గాయాలేవీ లేవని ఆ బులెటిన్ లో స్పష్టం చేశారు. ప్రధాన అవయవాల్లో రక్తస్రావం లేదని, ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు.