మొదటి నుంచి కూడా సూర్య వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. బయోపిక్ గా వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాకు, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన ఒక యథార్థ సంఘటన ఆధారంగా 'జై భీమ్' సినిమా చేశాడు. తన సొంత బ్యానర్ పై సూర్య ఈ సినిమా నిర్మించాడు. ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపించనున్నాడు. ఒక కేసులో సామాన్యులకి అన్యాయం జరుగుతూ ఉండటం చూసి, వారి తరఫున నిజాయతీగా పోరాడిన ఒక న్యాయవాది కథ ఇది. బలమైన ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.