శ్రుతిహాసన్ కి మైత్రీ మూవీస్ స్వాగతం!

Admin 2021-11-05 03:52:50 ENT
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుందంటూ గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే శ్రుతిహాసన్ ఎంపికను ఖరారు చేస్తూ, ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం దీపావళి రోజున ఒక పోస్టర్ వదిలింది. బాలకృష్ణతో శ్రుతి నటించడం ఇది తొలిసారి కాగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించడం మాత్రం మూడోసారి అవుతుంది. గతంలో ఆయనతో 'బలుపు, 'క్రాక్' సినిమాలు చేసింది.