టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా రష్మిక

Admin 2020-09-12 17:34:41 entertainmen
చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న చరణ్ సరసన కూడా రష్మికను తీసుకోవాలని చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇదిలావుండగానే, మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో వరుణ్ తేజ్ సరసన కూడా ఆమె నటించే అవకాశం వుందని తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ 'బాక్సర్' టైటిల్ తో ఓ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా మొదట్లో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ ను తీసుకున్నారు. అయితే, తాజాగా ఆమె స్థానంలో రష్మికను ఈ ప్రాజక్టులోకి తీసుకురావాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.