- Home
- sports
'భారత్కు ప్రపంచకప్ అందించడమే నా లక్ష్యం'
భారత్కు టీ20 ప్రపంచకప్ అందించడమే తన పెద్ద లక్ష్యమని వెటరన్ బ్యాటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్లో బెంగళూరు తరఫున అదిరిపోయే ప్రదర్శన చేస్తోన్న దినేశ్.. శనివారం రాత్రి దిల్లీతో తలపడిన మ్యాచ్లో మరోసారి రెచ్చిపోయాడు. 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన కార్తీక్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ప్రస్తుత, దీర్ఘకాల లక్ష్యాలను వెల్లడించాడు.