ముంబైలో విలాసంతమైన రెండు అపార్ట్‌మెంట్లు కొనుగోలు : హృతిక్ రోషన్

Admin 2020-10-25 20:22:13 entertainmen
హృతిక్ రోషన్ ముంబైలో విలాసంతమైన రెండు అపార్ట్‌మెంట్లు కొన్నట్లు తెలిసింది. వాటి విలువ అంతా కలిపి దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందట. ఒకటి డ్యూప్లెక్స్‌ పెంట్‌ హౌస్ కూడా ఉంది. జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లో ఆయన ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి వాటిని కొన్నాడు. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఒకదాని టెర్రస్ 6,500 చదరపు అడుగుల వరకు ఉంటుంది. 27,534 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ ఉంటుంది. తన ఈ నివాసాలను అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్ డిజైనర్ అషీష్ షాకు హృతిక్ కాంట్రాక్టు ఇచ్చాడు