- Home
- bollywood
'ఆదిపురుష్' నాయికగా కృతి సనన్..
హీరో ప్రభాస్ నటించే తొలి డైరెక్ట్ హిందీ చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించే ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడిన దగ్గర నుంచీ సంచలనం రేపుతోంది.అటు ఆర్టిస్టుల పరంగా ఇప్పటికే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. సినిమాలో కీలక పాత్ర అయిన హీరోయిన్ సీత పాత్ర విషయమై మొదటి నుంచీ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కీర్తి సురేష్.. అనుష్క శెట్టి.. అనుష్క శర్మ.. ఇలా ఎన్నో పేర్లు వార్తలలో వినిపించాయి. అయితే, ఈ సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటించనున్నట్టు తెలుస్తోంది. నాటి రామాయణాన్ని సోషియో ఫాంటసీ కథగా మార్చి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగును నిర్వహించి, మూడు నెలల్లోనే పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.