అల్లు అర్జున్‌కి చోటు

Admin 2021-02-15 15:40:35 entertainmen
దేశంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన ప్ర‌ముఖుల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ 25వ స్థానం ద‌క్కించుకున్నాడు. లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ జీక్యూ ఈ జాబితాను విడుద‌ల చేసింది. ఈ యంగ్‌ అచీవర్స్‌ జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్క‌డే నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా యువ సంచ‌ల‌నం రిషభ్‌ పంత్ అగ్ర‌స్థానంలో నిలిచాడు. మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో సినీ నిర్మాత కర్ణేశ్‌ శర్మ, రేస‌ర్ జెహాన్‌ దారువుల, 3 వన్‌ 4 క్యాపిటల్‌ స్థాపకులు ప్రణవ్‌ పై, సిద్ధార్థ్ పై ఉన్నారు. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్ డా.నందిని వెల్హో, సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్ అక్షయ్‌ నహేట, ఆర్టిస్ట్‌ మీనమ్‌ అపాంగ్, సీఆర్‌ఈడీ స్థాపకుడు కునాల్‌ షా, కమెడియన్‌ దనీష్‌ సైత్, స్వాప్నిల్‌ జైన్‌, ఆథర్‌ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు తరుణ్‌ మెహతా, రియల్‌మీ ఇండియా, యూరప్‌ సీఈవో మాధవ్‌ షేత్‌, డిజిటల్‌ క్రియేటర్ లీజా మంగళ్‌దాస్‌, వాదమ్‌ టీస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో బాలా సర్దా ఉన్నారు. త‌ర్వాతి స్థానాల్లో వ‌ర‌స‌గా స్కాలర్‌, పబ్లిక్‌ ఇంటలెక్చువల్ డా. సూరజ్ యెంగ్డె, ట్రాన్స్ ఉమెన్‌ డాక్టర్‌, కంటెంట్‌ క్రియేటర్ డా.త్రినేత్ర హల్దార్‌ గుమ్మరాజు, ఫిల్మ్‌ మేకర్ చైతన్య తమనే, టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌, ద గుడ్‌ ఫుడ్‌ ఇనిస్టిట్యూట్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్ వరుణ్‌ దేశ్ పాండే, అపరాజిత నీనన్‌, నావో స్పిరిట్స్‌ సహ వ్యవస్థాపకుడు ఆనంద్‌ విర్‌మాని, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియా హెడ్‌ ఆఫ్‌ ఒరిజినల్స్ అపర్ణ పురోహిత్‌, త్రైవ్‌ సహ వ్యవస్థాపకుడు క్రిషి ఫగ్వానీ, సంగీతకారులు, ద సుబ్రహ్మణ్యం అకాడమీ ఆఫ్‌ పర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ స్థాపకులు అంబీ, బిందు సుబ్రహ్మణ్యం, హీరో సైకిల్స్‌ డైరెక్టర్ అభిషేక్‌ ముంజల్‌, బైజూస్‌ సీఈవో, వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్, క్రికెట‌ర్ కేఎల్‌ రాహుల్ ఉన్నారు.