31వ తేదీన మహేశ్ ఫస్టులుక్ ఖాయమట!

Admin 2021-05-08 20:53:21 entertainmen
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ను ఇటీవలే దుబాయ్ లో చిత్రీకరించారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. సుబ్బరాజు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్టు గ్లింప్స్ కూడా వదిలే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పుడే టీజర్ ను వదలరట. ఈ నెలలో అభిమానుల ముచ్చట తీర్చేది ఫస్టులుక్ మాత్రమేనని చెప్పుకుంటున్నారు.