- Home
- tollywood
'సర్కారువారి పాట'తో బిజీగా మహేశ్
త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఇంతకుముందు 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు రూపొందాయి. మూడో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సస్పెన్స్ కి ఈ నెల 31వ తేదీతో తెరపడనుందని చెబుతున్నారు.ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రానున్నట్టుగా చెబుతున్నారు. 'సర్కారు వారి పాట' నుంచి కూడా టీజర్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. సినిమా విడుదలకి ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పుడే వద్దని మహేశ్ అనడం వలన ఆగిందని అంటున్నారు. త్రివిక్రమ్ - మహేశ్ మూవీలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.