- Home
- tollywood
35 మిలియన్స్ కి పైగా వ్యూస్ : సర్కారువారి పాట
మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. ఇటీవల గోవాలో జరిగిన షెడ్యూల్ తో కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. టీజర్ ను యూ ట్యూబ్ లో వదిలిన దగ్గర నుంచి ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. పాత రికార్డులను చెరిపేస్తూ, కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా 35 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను .. 1 మిలియన్ కి పైగా లైక్స్ ను రాబట్టింది. ఈ టీజర్ జోరు ఈ సినిమా యూనిట్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. మహేశ్ బాబు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. యాక్షన్ తో పాటు కామెడీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది.