23న 'మహాసముద్రం' ట్రైలర్

Admin 2021-09-21 01:54:51 ENT
శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా 'మహా సముద్రం' చిత్రం రూపొందింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. యాక్షన్ .. ఎమోషన్స్ సమపాళ్లుగా కలిపి, ఆయన ఈ కథను రెడీ చేశాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్లకు .. స్పెషల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో, అదితీ రావు .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. రావు రమేశ్ కనిపించనున్నారు.