బాలకృష్ణకు జోడీగా శ్రుతిహాసన్

Admin 2021-10-28 03:39:07 ENT
ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్' సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రుతిహాసన్ త్వరలో బాలకృష్ణకు జంటగా నటించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రంలో హీరోయిన్ పాత్రకు శ్రుతిహాసన్ ఎంపిక దాదాపు పూర్తయినట్టు సమాచారం.