కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండాలి అంటే.?

Admin 2022-04-19 11:37:21 ENT
శరీర అవయువాల్లో అతి ముఖ్యమైనవాటిలో కిడ్నీలు ఒకటి.. అలాంటి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే.. ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యమైంది. కిడ్నీ సమస్యలు వచ్చాయి అంటే చాలా ప్రమాదకరమే అని చెప్పాలి. ఎందుకంటే మనిషి ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కిడ్నీలను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధుమేహం.. అదధిక రక్తపోటు.. మధ్యపానం.. గుండె జబ్బులు.. హైపటైటీస్ సి.. హెచ్ఐవి వంటి మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది కాళ్ళు, చీలమండలలో వాపుకు కారణమవుతుంది. అదనంగా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే చాలా ప్రోటీన్ మూత్రంలో విసర్జించబడుతుంది. ఫలితంగా కళ్ల చుట్టూ తరచుగా వాపు ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే కిడ్నీలను పరీక్షించాల్సి ఉంటుంది. అదనంగా కండరాల తిమ్మిరి మూత్రపిండాల వ్యాధికి సంకేతం.

ముఖ్యంగా ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్స్ తీసుకోవడం చాలా వరకు తగ్గించుకోవాలి. కొవ్వు పదార్ధాల రెగ్యులర్ వినియోగం మూత్రపిండాల మొత్తం క్రియాత్మక సామర్థ్యానికి తీవ్రమైన సవాలును విసురుతుంది. తెల్ల రొట్టె, పాస్తా, పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స తో పాటు, బేకరీ ఉత్పత్తులు తినడం వల్ల కిడ్నీ సమస్యలు కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది.