రెండు మ్యాచ్‌లలోనే బాగా రాణించాం : ధోనీ

Admin 2020-10-24 19:47:13 entertainmen
షార్జాలో నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిత్తుగా ఓడి అభిమానులను తీవ్ర నిరాశపర్చిన విషయం తెలిసిందే. సారి మాత్రం ఘోరంగా విఫలం కావడం గమనార్హం. దీనిపై ఆ జట్టు కెప్టెన్ ధోనీ స్పందిస్తూ... ఈ సీజన్‌లో తాము ఒకటి, రెండు మ్యాచ్లలోనే బాగా రాణించామని తెలిపాడు. రాయుడికి గాయమైందని, మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమవుతున్నారని చెప్పాడు. టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించకపోతే మిడిల్‌ ఆర్డర్‌పై ప్రభావం చూపుతుందని చెప్పాడు. క్రికెట్‌లో ఓటములు ఎదురవుతుంటే కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని ఆయన అన్నాడు, అయితే, ఈ సీజన్‌లో మాత్రం తమకు అలా జరగలేదని, తాము టాస్‌లు గెలవలేదని చెప్పాడు. దీంతో తాము కొన్నిసార్లు రెండో ఇన్నింగ్స్‌లో ఆడాల్సి వచ్చిందని, నలుగురు బ్యాట్స్‌మెన్ రాణించకపోతే అది ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు. అయితే, అవన్నీ ఆటలో భాగమేనని తాను భావిస్తానని తెలిపాడు.