- Home
- tollywood
తొలిసారిగా ఫొటో షూట్ లో పాల్గొన్న దంపతులు
మోహన్ బాబు, తొలిసారిగా తన భార్య నిర్మలతో కలిసి ఫొటో షూట్ లో పాల్గొనగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది. ఇటీవల విష్ణు చిన్న కుమార్తె విద్య తొలి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కరోనా కారణంగా ఎవరినీ పిలవక పోయినా, ఇంట్లోనే అందరూ కలిసి గ్రాండ్ గా ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్యూటిఫుల్ మెమొరీస్ కోసం మోహన్ బాబు, నిర్మల దంపతులకు ఫొటో షూట్ చేయించారు. మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమ ఫ్యామిలీకి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా ఎవరో ఒకరు ఫ్యాన్స్ తో పంచుకుంటారు. తాజా ఫొటో షూట్ వీడియోను 'బిహైండ్ ది సీన్' అంటూ మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.