- Home
- tollywood
రష్మిక మండన్నా మాస్క్ పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు
‘రష్మిక మండన్నా’లో ఇంకా ఆ చిలిపితనం, అలాగే చిన్నపిల్లల చేష్టలు పోలేదు. లాక్ డౌన్ ఎత్తేశారు, కానీ కోవిడ్ తన ప్రభావాన్ని ఇంకా చూపిస్తూనే ఉంది. అందుకే, బయట అడుగు పెడితే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే అంటూ ప్రభుత్వం కఠిన నియమాలు పెట్టింది. మాస్క్ పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు, ఇప్పుడు ఈ కోవలోకి రష్మిక కూడా చేరింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ డైరెక్టర్ల చుట్టూ చక్కర్లు కొడుతోంది. వరుస బాలీవుడ్ అవకాశాల కోసం తెగ ఆరాటపడుతుంది. ఈ క్రమంలో అన్ని బాలీవుడ్ సినిమా ఆఫీసుల చుట్టూ రౌండ్లు వేస్తోంది. రష్మిక కారు దిగి అలా నడుచుకుంటూ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతూ ఉండగా, సడెన్ గా ఈ కుర్ర భామకు మాస్క్ గుర్తుకొచ్చింది. తాను మాస్క్ పెట్టుకోలేదని అర్థం చేసుకుంది. కానీ అంతలోనే ఎడాపెడా ఫోటోలు తీసి పడేసిన ఎదురుగా ఉన్న ఓ జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ వైపు చూస్తూ మాస్క్ మర్చిపోయాను సారీ అంటూ ఓ క్షమాపణ కూడా చెప్పింది.