పవన్ కల్యాణ్ నుంచి 'భీమ్లా నాయక్'

Admin 2021-08-30 02:39:04 ENT
పవన్ కల్యాణ్ - సాగర్ చంద్ర కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. రానా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం వారు 5.04 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది. డ్యూయెట్లు పెద్దగా లేనప్పటికీ, సందర్భానుసారం వచ్చే పాటలు ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు.