విడుదలకి సిద్ధమైన 'విరాటపర్వం'

Admin 2021-10-17 11:01:15 ENT
రానా కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఆ మధ్య వచ్చిన 'అరణ్య' .. ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఇక ఆయన నుంచి 'విరాటపర్వం' సినిమా రానుంది. మరో వైపున 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చేయడానికి రానా రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రానా హీరోగా మిలింద్ రావ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందనున్నట్టు నిన్న ఓ ప్రకటన వచ్చింది. గోపీనాథ్ ఆచంట .. రాంబాబు .. అర్జున్ దాస్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషలలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా జోనర్ గురించిన టాక్ నడుస్తోంది. మిలింద్ రావ్ సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. గతంలో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'అవళ్' (గృహం) .. నయనతార చేసిన 'నేత్రికన్' ఆయన దర్శకత్వంలో వచ్చినవే.